Mar 29, 2024, 15:03 IST/షాద్నగర్
షాద్నగర్
బిజెపి పార్టీలో భారీ చేరికలు
Mar 29, 2024, 15:03 IST
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కుంట్ల రామిరెడ్డి గార్డెన్ లో స్థానిక బిజెపి నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పాలమూరు పార్లమెంటు బిజెపి అభ్యర్థిని డీకే అరుణ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 1000 మందికి పైగా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీకే అరుణ మాట్లాడారు.