బేతంచెలు పట్టణంలోని విద్యార్థి వామపక్షాల సంఘాల ఆధ్వర్యంలో సిమెంట్ జూనియర్ కళాశాల నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తాసిల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధు శేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ నాయక్, మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా రంగంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని బుధవారం కోరారు.