ఖరీఫ్ రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేయకుండా అరికట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన తాండ్రపాడు, గొందిపర్ల గ్రామాల్లో పర్యటించి, రైతుల సాగు భూములను పరిశీలించి, మాట్లాడారు. పత్తి, మొక్కజొన్న, కంది, మిరప, ఉల్లి ఆముదం, కొర్రలు, మినుము రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలని, పెట్టుబడి సాయం రూ. 20 వేలు ఇవ్వాలన్నారు. బ్యాంకు రుణాలు ఇవ్వాలన్నారు.