సాగులో నూతన యాజమాన్య పద్ధతులు పాటించాలి: ఏడీఏ

51చూసినవారు
సాగులో నూతన యాజమాన్య పద్ధతులు పాటించాలి: ఏడీఏ
పంటలు సాగులో నూతన యాజమాన్య పద్ధతులను తప్పక పాటించాలని కర్నూలు ఏడీఏ సాలురెడ్డి సూచించారు. గురువారం కోడుమూరు మండలంలోని ముడుమలగుర్తిలో ఏవో రవిప్రకాష్ రైతులతో కలిసి పొలం పిలుస్తోంది నిర్వహించి, మాట్లాడారు. పెట్టుబడులను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలన్నారు. యేటా ఒక పంట కాకుండా పంట మార్పిడి తప్పని సరిగా చేయాలని సూచించారు. ఖరీఫ్ కింద సాగు చేసిన కంది పంట ప్రస్తుతం పూత దశకు చేరుకుందన్నారు.

సంబంధిత పోస్ట్