పెద్దకడబూరు గ్రామ శివారుల్లోని జంగం పార్వతమ్మ ఏర్పాటు చేసుకొన్న గడ్డివాము ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమయింది. దీంతో రూ. 15 వేలు ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పంటుకొని మంటలు పెద్ద కావడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై మంటలు ఆర్పేలోగా గడ్డివాము పూర్తిగా కూలిపోయింది. ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.