మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ తిక్కారెడ్డి ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డారు. నియోజకవర్గంలో టీడీపీని తన భుజాన మోసి క్యాడర్ ను కాపాడారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ను బీసీలకు కేటాయించడంతో గత కొన్ని రోజులుగా పార్టీ తీరును నిరసిస్తూ నిరసనలతో ఎండగట్టారు. ఇటివలే బాబు తిక్కారెడ్డిని రప్పించుకొని బుజ్జగించారు. అయినా తిక్కారెడ్డి వైసీపీలో చేరుతారని బుధవారం పలువురు చర్చించుకుంటున్నారు.