పాణ్యం నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూచించారు. మంగళవారం గ్రీవెన్స్డే కార్యక్రమంలో భాగంగా గడివేముల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలం నలుమూలల నుంచి ప్రజా సమస్యలపై వచ్చిన ఆర్జీలను ఎమ్మెల్యే చరితారెడ్డి స్వీకరించారు. ఆమె మాట్లాడారు. గ్రీవెన్స్డేలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.