42 ఏళ్ల కిందట విడిపోయిన పూర్వ విద్యార్థులు మళ్లీ కలుసుకోవడానికి ఎమ్మిగనూరులోని ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వేదికయ్యింది. 1981-1982 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఒకచోటికి చేరి ఆనంద క్షణాలను ఆస్వాధించారు. ఈ బడిలో చదివిన పూర్వవిద్యార్థుల్లో ప్రసాద్ ఏసీబీ జడ్జి, సోమశేఖర్ ఎంఈఓ, బోడఈరన్న, ఎంఈఓ, వేంకటెశ్వర్లు డీఎం టెలికాం, శ్రీనివాసులు ఏఈ, వివిధ హోదాలలో ఉన్నారు.