గురజాల గ్రామంలో జోరుగా సాగిన టీడీపీ నాయకుల ప్రచారం
నందవరం మండల పరిధిలోని గురజాల గ్రామంలో టీడీపీ నాయకుల ప్రచారం మంగళవారం జోరుగా సాగింది. రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డిని, ఎంపీ అభ్యర్థి బస్తిపాటి కురువ నాగరాజు ని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజేశ్వర రెడ్డి, శివారెడ్డి, వెంకటరాముడు, నర్సన్న, పుల్లయ్య, చార్లెస్, జయరాముడు, వరాలు తెలుగు కర్ణ, బీమేష్ రెడ్డి, రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.