మహిళా కౌన్సిలర్‌పై ఎమ్మెల్యే బెదిరింపులు.. కేసు నమోదు

90376చూసినవారు
మహిళా కౌన్సిలర్‌పై ఎమ్మెల్యే బెదిరింపులు.. కేసు నమోదు
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 19న వైసీపీ మహిళా కౌన్సిలర్ వెంకట లక్ష్మి ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తన భర్త రామాంజనేయులు కాళ్లు విరిచేస్తానంటూ వార్నింగ్ ఇచ్చినట్లు కౌన్సిలర్ వాపోయారు. ఎమ్మెల్యేతో తమకు ప్రాణహాని ఉందని ఎస్పీ, ఎన్నికల కమిషనర్‌కు దంపతులు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you