వైసీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి పేర్కొన్నారు. డోన్ మండల పరిధిలోని పీఆర్ పల్లిలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ బొర్రా మల్లి కార్జునరెడ్డి తదితరులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు.