ఉల్లి రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ఏవో కీలక సూచనలు

55చూసినవారు
కోడుమూరు మండలంలో అధిక వర్షాల కారణంగా పంటకు కుళ్లు తెగులు సోకే ప్రమాదముందని ఉల్లి రైతులంతా అప్రమత్తంగా ఉండాలని ఏవో రవిప్రకాష్ సూచించారు. బుధవారం వెంకటగిరిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏవో నిర్వహించి, మాట్లాడారు. ఉల్లిసాగులో పాటించాల్సిన మెలకువలు, చీడపీడల, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏవో వివరించారు. ఏదైనా పురుగు ఉంటే వెంటనే వేపనూనె, ఆస్పేట్ పిచికారీ చేసుకోవాలని ఏవో సూచించారు.

సంబంధిత పోస్ట్