
నందికొట్కూరు: మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నిరసన
కేంద్ర ప్రభుత్వం భద్రత వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు ఎం. నాగేశ్వరావు డిమాండ్ చేశారు. శుక్రవారం నందికొట్కూరు పటేల్ సెంటర్ లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో మృతి చెందిన కుటుంబాలకు ఆత్మశాంతి చేకూరాలని నిరసన కార్యక్రమం చేపట్ట్టారు.