బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మోత్సవాలు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీ. సోమవారం రాత్రి విశేష పుష్ప అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.