నెల్లూరు సిటీ నియోజకవర్గం పరిధిలో 2262 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. స్థానిక డి. కె మహిళ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ ఆదివారం పర్యవేక్షించారు. ఈనెల 5, 6, 7 తేదీల్లో కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు..