25 ఎంపీ, 160 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఖాయం: చంద్రబాబు
జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి విజయం ఖాయమని టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన శుక్రవారం రాత్రి నెల్లూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఎంపీ 160 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి కూటమి విజయం సాధిస్తుందన్నారు.