
మోపిదేవి: వైద్య ఆరోగ్య సేవలపై నిర్లక్ష్యం వద్దు
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలు ప్రజలకు అందించడం నిర్లక్ష్య వహించరాదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని శర్మిష్ట తెలిపారు. మంగళవారం మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోకి వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి చికిత్సలపై గ్రామస్తులకు అవగాహన కల్పించి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.