జనసేనకు పోతిన మహేష్ రాజీనామా చేయటంతో పార్టీకి పట్టిన శని వదిలిపోయిందని జిల్లా జనసేన పార్టీఅధికారప్రతినిధిఆళ్ళహరిఅన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమక్షంలోమహేష్ వైసీపీ తీర్థం తీసుకోవటంపైబుధవారం విలేకరులతో మాట్లాడుతూ వైకాపా నేతల గుప్పిట్లోకి వెళ్లిన మహేష్ వైసీపీ కోవర్టుగామారాడని ఆరోపించారు. పవన్ కల్యాణ్ బొమ్మ పెట్టుకోకపోయినా జనసేన జెండాపెట్టుకోకపోయినా మహేష్ ను పక్కింటోడుకూడా పట్టించుకోరనివిమర్శించారు.