చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 16న
సీఎం జగన్ పర్యటించనున్నారు. YSR చేయూత పథకంలో భాగంగా SC, ST, OBC, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ చేయనున్నారు. చేయూత పథకం నాలుగవ విడతలో దాదా
పు 26 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.