సార్వత్రిక ఎన్నికల సమయంలో దాడులకు పాల్పడిన 20 మందికి మంగళవారం కోర్టు రిమాండ్ విధించింది. ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు పోలింగ్ రోజు జరిగిన దాడుల సంఘటనలో వెల్దుర్తి మండలం కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన 20 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో కోర్టు వారికి రిమాండ్ విధించడంతో నెల్లూరు జిల్లా జైలుకు పంపారు.