వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉన్న రజకులకు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. శనివారం మాచర్ల స్థానిక నరిశెట్టి కళ్యాణ మండపంలో నియోజకవర్గ రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రజక సంఘం నేతలు పాల్గొన్నారు.