నరసరావుపేటలో శుక్రవారం జరిగే వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఏర్పాట్లకు సంబంధించి ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.