అచ్చంపేట మండలం లోని చెరుకుంపాలెం గ్రామం నుండి కూలీలు
టాటా ఏసీలో శనివారం తాడు వాయి గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. దారిలో సండ్ర తండా వద్ద
టాటా ఏసీ వాహనం బోల్తా పడినది. దింతో వాహనంలో మొత్తం 25 మంది ఉండగా వారిలో పది మందికి గాయాలయ్యాయి. ఆంబులెన్స్ ద్వారా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.