విజయవాడలోని వరద బాధితులకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆహారం పొట్లాలు మంగళవారం పంపిణీ చేశారు. మంగళవారం విజయవాడలో పర్యటించిన ప్రత్యేకంగా వరద బాధితుల కోసం ఆహారం, మంచినీరు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎవరు అధైర్యపడవద్దని సూచించారు. వరద వలన అతలాకుతలమైన వారు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.