నీట మునిగి విజయవాడ ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు, రాజధాని అమరావతి మునిగిందని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ సిగ్గుమాలిన రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. గురువారం ఆయన వినుకొండలో మీడియాతో మాట్లాడుతూ.. వరదలో బురద రాజకీయం మానుకో జగన్ అంటూ ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా చెడు ప్రచారం చేయడం మానుకోవాలి అన్నారు.