
చీపురుపల్లిలో టీడీపీ సంబరాలు
విజయనగరం డీసీసీబీ చైర్మన్ గా కిమిడి నాగార్జునకు పదవి రావడంపై చీపురుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఆనందం వ్యక్తం చేశారు. చీపురుపల్లిలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి లక్ష్మణరావు, రేగిడి వాసు, మీసాల కాశీ, బోర భాస్కరరావు, కోండ్రు లక్ష్మణరావు, దిండి రమేష్, పనస రవి, నారాయణరావు, లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.