వరి పంటకు నష్టం వాటిల్లింది

64చూసినవారు
వరి పంటకు నష్టం వాటిల్లింది
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో 39 హెక్టార్ల మేర వరి పంటకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వి టి రామారావు తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ వరి పంటతో పాటు 7. 7 హెక్టార్ల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టం పై ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ లో వివరాలను నమోదు చేసామని, నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్