ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. హెలికాప్టర్లో పొన్నూరు చేరుకోనున్నారు. అయితే హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను నిన్న అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు జేసీబీతో తవ్వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.