చిరంజీవి జోలికొస్తే సహించేది లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. "చిరంజీవి జోలికి రావొద్దు. ఆయన అజాత శత్రువు. చిరంజీవి కాంగ్రెస్లో ఉంటారో వేరే పార్టీలో ఉంటారో ఆయన ఇష్టం. వైసీపీకి మద్ధతు ఇచ్చినప్పుడు సొంత తమ్ముడినైన నేను ఒక్క మాట మాట్లాడలేదు. సజ్జల గారు మీరు చిరంజీవి, రాష్ట్ర ప్రజల జోలికి రావొద్దు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి." అని పవన్ హెచ్చరించారు.