ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సిలింగ్ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు బి.నవ్య తెలిపారు. పాలిసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశాల కోసం వెబ్ ఆధారిత కౌన్సిలింగ్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 16న సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.