
పహల్గాం ఉగ్రదాడిలో 25 మంది ప్రత్యక్ష సాక్షుల విచారణ
పహల్గాం ఉగ్రదాడి కేసుకు సంబంధించి ఇప్పటివరకు 25 మంది బాధితులు, ప్రత్యక్ష సాక్షులను NIA విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. బైసరన్ ప్రాంతంలో పనిచేసే స్థానిక వర్కర్లు, టీ స్టాళ్లు నడిపేవారు, భేల్పురి అమ్ముకునే వ్యాపారుల నుంచి వివరాలు సేకరిస్తుంది. దాడి చేసే ప్రాంతానికి ఇద్దరు ఉగ్రవాదులు మెయిన్ గేట్ నుంచి, మరో ఉగ్రవాది ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చినట్లు NIA అధికారులు గుర్తించారు.