పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డిప్యూటీ డి ఎం హెచ్ ఓ

79చూసినవారు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డిప్యూటీ డి ఎం హెచ్ ఓ
దోమల వల్ల ప్రాణాంతక వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని, దోమల వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కనిగిరి డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సృజన తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వర్షంలో అధికంగా తడవడం వల్ల జ్వరం, జలుబు వంటివి సంభవిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.