కొత్తపట్నం మండలం పిన్నివారి పాలెంలో వైసీపీకి చెందినవారు టిడిపిలో చేరారు. ఆ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు అంగ బుజ్జింగరావు, పిన్ని రత్తయ్య, పిన్ని నాగరాజు, రంగా సుబ్బారావు, పెద్దసింగు శివాజీలు బుధవారం ఒంగోలులో నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్ధన సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేగా గెలిపించాలని వారిని కోరారు.