ఒంగోలు కొండమీద శ్రీగిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను జూన్ 15 నుండి 19వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ ఆలూరి ఝాన్సీ రాణి, కార్య నిర్వహణ ధర్మకర్త సి. వి రామకృష్ణారావు మంగళవారం వెల్లడించారు. 15వ తేదీ శనివారం సాయంత్రం శ్రీగిరి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు. భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.