చీమకుర్తిలో హెడ్ కానిస్టేబుల్ పై అట్రాసిటీ కేసు
చీమకుర్తి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను కులం పేరుతో దూషించారన్న ఫిర్యాదు నేపథ్యంలో చీమకుర్తి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంగళ్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. దేవరపాలేనికి చెందిన కాకమ్మ ఆయనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో విచారించి ఈ చర్యలు తీసుకున్నట్లు శనివారం సీఐ తెలిపారు.