స్వచ్ఛ గ్రామంగా రూపుదిద్దుకుందాం

1074చూసినవారు
స్వచ్ఛ గ్రామంగా రూపుదిద్దుకుందాం
గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పుల్లలచెరువు పంచాయతీ కార్యదర్శి బాలు నాయక్ అన్నారు.మంగళవారం గ్రామంలోని మురికి కాల్వలపై, వీధుల్లో బ్లీచింగ్ చల్లించారు.గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ఎక్కడ పడితే అక్కడ చెత్తవేయరాదని ప్రజలకు సూచించారు. మురికి కాల్వలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్డు నిర్మించుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్