ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్
దేశంలో ఐదో విడత ఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5.30 గంటల ముందు క్యూ లైన్ లో ఉన్నవారు ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. 8.95 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 4.26 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 5 వేల 409మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. వీరికై 94,732 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 543 లోక్సభ స్థానాలకు గానూ ఐదో విడత పోలింగ్తో 428 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది.