సీఎం జగన్పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. "మన ఆశలను సైకో జగన్ సర్వనాశనం చేశారు. రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. పోలవరం పూర్తిచేసి హంద్రీనీవాతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తాం. రాయలసీమ ద్రోహి జగన్. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయలేదు. ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రాష్ట్రానికి జగన్ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు." అని ఆయన విమర్శించారు.