నారా లోకేష్ ఫోన్కు సెక్యూరిటీ అలెర్ట్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలెర్ట్ పంపించింది. నారా లోకేష్ ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ ప్రయత్నం జరుగుతోందని యాపిల్ సంస్థ ఈ-మెయిల్లో పేర్కొంది. ట్యాపింగ్, హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేష్కు యాపిల్ సంస్థ సూచించింది. కాగా, వైసీపీ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.