సామాజిక మాధ్యమాల ద్వారా కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతున్న సోషల్ మీడియా వారియర్లను అరెస్టులు చేయించడం దారుణమని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్తో కూడిన పాలిటిక్స్లో చంద్రబాబు మరింత బరితెగించారని దుయ్యబట్టారు. 'మరి వ్యవస్థీకృత నేరాల కింద అరెస్టు చేయాల్సింది ఎవరిని? జీవిత ఖైదు వేయాల్సింది ఎవరికి? చంద్రబాబుకు కాదా?' అని నిలదీశారు.