అపరిశుభ్రంగా మారిన సాంఘిక సంక్షేమ వసతి గృహం

67చూసినవారు
పుట్టపర్తిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో అపరిశుభ్రత నెలకొంది. వసతి గృహంలో దాదాపు 130 మంది విద్యార్థులు ఉండగా వారికి కేవలం మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉపయోగకరంగా ఉన్నాయి. మిగిలినవి అపరిశుభ్రంగా మారి శిథిలవస్థకు చేరాయి. విద్యార్థులు స్నానం చేసే ప్రాంతం పాచి పట్టడంతో అక్కడ తీవ్ర అపరిశుభ్రత నెలకొంది. ఆవరణంలో మురికి నీరు ప్రవహిస్తూ దోమలకు నిలయంగా మారింది.

సంబంధిత పోస్ట్