నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

67చూసినవారు
నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన నలుగురిపై మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ బాషా తెలిపారు. గ్రామానికి చెందిన రామాంజినమ్మ, ఖాశీం పీరాల మధ్య పొలం తగాదా విషయంలో సెప్టెంబరు 11న ఘర్షణ పడ్డారు. రామాంజినమ్మ కుటుంబ సభ్యులపై కులం పేరుతో దూషించినందుకు మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఖాశీంపీరా, మహబుబ్బీ, ఖాదర్ భాష, రెహనాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్