20వ వార్డు వెంగళరావు కాలనీలో టిడిపి నాయకులు సూపర్ సిక్స్ పథకంపై అవగాహన ప్రచారం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ రెడ్డి గౌరీ రాంబాబు ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్ పర్యవేక్షణలో శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. టిడిపి కూటమి అభ్యర్థి కూన రవికుమార్ ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటరు లను కోరారు.