ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుదిటి ఈశ్వరరావు గెలుపుకు జనసేన పార్టీ తరుపున పూర్తి మద్దతు ఉంటుందని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ విశ్వక్షేన్ అన్నారు. రణస్థలం మండలం కొవ్వాడ గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఈశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుందామని అన్నారు.