మతోన్మాద బిజెపితో జత కట్టిన, టిడిపి, జనసేన నిరంకుశ వైసిపిలను ఓడించాలని. వామపక్ష లౌకిక శక్తుల ప్రత్యామ్నాయమే ఈ దేశానికి రక్షణని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. గోవిందరావుఅన్నారు. గురువారం సోంపేట సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల విస్తృత సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని లోక్ సభ ఎన్నికలలో సిపిఎం, వామపక్షాల బలాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.