నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక జట్టు కళాశీల యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఏటా జట్టు కళాశీల యూనియన్ ఆధ్వర్యంలో ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. యూనియన్ అధ్యక్షులు నేతింటి జనార్దనరావు, గౌరవ అధ్యక్షులు విశ్వేశ్వరరావు, కింజరాపు ముసలి నాయుడు తదితరులు పాల్గొన్నారు.