నరసన్నపేట మేజర్ పంచాయతీలోని ప్రధాన రహదారిలో రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన మురికి కాలువలు నేడు వ్యర్ధాలు పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. దీంతో మురుగు పారక దుర్గంధం వెదజల్లుతూ ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత పంచాయతీ అధికారులు దీనిపై తగిన దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. దీనిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.