సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రానున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులనే గెలిపించాలని కౌన్సిలర్ సర్వాన గీతారవి అన్నారు. పలాస మున్సిపాలిటీ 10వ వార్డు డెంకి వీధిలో వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో అందించిన సంక్షేమ పథకాలు, రానున్న ఐదేళ్లలో అందించనున్న సంక్షేమ పథకాలు పై శనివారం ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమం కొనసాగాలంటే డాక్టర్ సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్ ను గెలిపించాలని కోరారు.