బుధవారం విజయవాడలో జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గం, మెలియాపుట్టి మండలం నుంచి జనసేన, బిజెపి, తెలుగుదేశం నేతలు మంగళవారం నాడు మెలియాపుట్టి మూడు రోడ్ల కూడలిలో బయలుదేరారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు కూటమి శ్రేణులంతా విజయవాడ వెళ్తున్నట్లు మాజీ ఎంపీపీ మోహన్ రావు తెలిపారు.