సంతబొమ్మాళి(నౌపడా) స్టేషన్ పరిధి మూడు రోడ్ల జంక్షన్ జగనన్న కాలనీలో పేకాట స్థావరంపై నౌపడ పోలీసులు దాడి చేశారు. సోమవారం కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నౌపడ పోలీసులకు అందిన సమాచారంతో.. పోలీసులు వెళ్లి రైడ్ చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.11, 970 నగదు స్వాధీనం చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిషోర్ వర్మ తెలిపారు.